కరోనా వైరస్ వచ్చాక దాదాపు అన్ని దేశాల్లో ప్రజలు విటమిన్ సీ, విటమిన్ డీ, జింక్ టాబ్లెట్లు వాడటం మొదలెట్టారు. వీటిని సప్లిమెంట్ల రూపంలో కాకుండా ఆహారాల ద్వారా పొందడం వల్లనే ఎక్కువ లాభాలను పొందవచ్చని పోషకాహార నిపుణులు సెలవిస్తున్నారు. విటమిన్ సీ.. చాలా ఆహార పదార్థాలతో లభిస్తుంది.
విటమిన్ సీ మన బాడీలో నిల్వ ఉండదు. మనకు కొద్దిగా వేడి చేసినా చాలు ఇది బయటకు వెళ్లిపోతుంది. అందువల్ల మనం కంటిన్యూగా విటమిన్ సీని పొందాలి. మన శరీరంలో ఇది సరిపడా లేకపోతే మాటిమాటికీ మనకు నీరసం వచ్చేస్తుంది. ఏ పని చెయ్యబుద్ధి కాదు. అలసిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. కొద్దిగా పనిచేయగానే విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. ఈ దశలో మీరు వెంటనే జాగ్రత్తపడాలి. లేదంటే మీపై వ్యాధులు దాడి చేయడానికి రెడీగా ఉంటాయని గుర్తించాలి.
విటమిన్ సీ లేకపోతే రోగాలను నిలిపే వ్యవస్థ పనిచేయడం లేదని అర్థం చేసుకోవాలి. అలాగే తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు. పిల్లల్లో సరిపడా సీ విటమిన్ లేకపోతే వారి ఎముకల్లో బలం ఉండదు. చిన్నవయసు నుంచే వారికి పండ్లు తినే అలవాటును నేర్పించాలి.
మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో విటమిన్ సీ అద్భుతంగా పనిచేస్తుంది. జనరల్గా మనకు రోగాలు తెచ్చే సూక్ష్మ క్రిములు మన శరీరంలోని కణాలను టార్గెట్ చేస్తాయి. అలా జరగకుండా సీ విటమిన్ బాడీలో ఉంటే సూక్ష్మజీవుల ఆటలు సాగవు.
బాడీలో సీ విటమిన్ పెరిగేకొద్దీ వైరస్లతో పోరాడే శక్తి పెరుగుతూ ఉంటుంది. ఎవరికైనా హై-బీపీ ఉంటే వారికి తప్పనిసరిగా విటమిన్ సీ మేలు చేస్తుంది. మెటబాలిజంను పెంచుతుంది. అంటే శరీరంలో ఏవేవి ఎంత స్థాయిలో ఉండాలో అంత ఉండేలా చేస్తుంది. గుండె జబ్బులు రాకుండా కూడా సీ విటమిన్ కాపాడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గాలంటే విటమిన్ సీ అవసరం.
విటమిన్ సీ మనకు నిమ్మకాయలు, బత్తాయిలు, కమలాలు, నారింజలు, ఉసిరి, యాపిల్, పచ్చిమిర్చి, పుల్లగా ఉండే పండ్లలో లభిస్తుంది. పుల్లటివి తింటే కరోనా సోకే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి. ద్రాక్షపండ్లు, బొప్పాయి, పుచ్చకాయి, స్ట్రాబెర్రీస్ వంటి వాటిలోనూ సీ విటమిన్ ఉంటుంది. గూస్ బెర్రీ, ఎరుపు, పసుపు కాప్పికమ్, బొప్పాయి వంటి వాటిని తింటూ ఉండాలి. కివీ పండు, మొలకలు, బ్రకోలీ, కాలీఫ్లవర వంటివి కూడా తింటే సీ విటమిన్ బాగా లభిస్తుంది.
అల్లంలో వ్యాధుల్ని అడ్డుకునే శక్తి అపారంగా ఉంటుంది. టీ తాగినా, వంటలు వండుకున్నా అందులో అల్లం వాడటం అలవాటు చేసుకోవాలి. తేనె, అల్లం రసం కలిపి వాడితే ఇంకా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రోజుకు మూడు-నాలుగు సార్లు అల్లం తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ అమాంతం పెరుగుతుంది.
తులసి.. ఇది మామూలు మొక్క కాదు. రోజూ నాలుగైదు తులసి ఆకుల్ని తింటే ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. అలాగే, తులసితోపాటూ 3 -4 మిరియపు గింజలు, ఓ టేబుల్ స్పూన్ తేనెను కలిపి తీసుకుంటే కరోనా మన దరిదాపులకు రాదని నిపుణులు సెలవిస్తున్నారు.
బొప్పాయిలో విటమిన్ సీ బాగా ఉంటుంది. పైగా బొప్పాయి తింటే ఆహారం బాగా జీర్ణమవుతుంది. బొప్పాయిలో పొటాషియం, విటమిన్ బీ, ఫోలేట్ కూడా ఉంటాయి. ఇవి మొత్తం శరీరానికి చాలా ఉపయోగపడతాయి.
నేపాల్ ఆర్మీకి లక్ష డోసుల భారత్ కొవిడ్ వ్యాక్సిన్
మోదీ పాపులర్ వ్యక్తే కావచ్చు.. కానీ, బెంగాల్లో దీదీ తర్వాతనే : ప్రశాంత్ కిషోర్
తేళ్లతో హోలీ కేళీ.. ఈ గ్రామం స్పెషల్..!
భారత్లో త్వరలో మూడో వ్యాక్సిన్కు ఆమోదం : డాక్టర్ రెడ్డీస్
వ్యాక్సిన్ తీసుకున్న పుతిన్కు సైడ్ ఎఫెక్ట్స్
తేడాలు మరచి కలిసి సాగుదాం : కమలా హారిస్ హోలీ సందేశం
చైనాలో చిక్కుకున్న ‘ఎవర్ గివెన్’ ట్రాలీ.. నిలిచిన ట్రాఫిక్
అగ్రి చట్టాలను మంటల్లో వేసి రైతుల ‘హోలీ కా దహన్’
చైనాలో బయటపడిన టెర్రకోట ఆర్మీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..