ప్రశాంత్నగర్/తొగుట/గజ్వేల్అర్బన్ /దుబ్బాక/చేర్యాల/ నంగునూరు /సిద్దిపేట టౌన్ /రాయపోల్,ఏప్రిల్ 21 : కరోనా వైరస్ పట్ల ప్రజలు నిర్లక్ష్యం చేయవద్దని రాయపోల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. బుధారం పలు గ్రామాల నుంచి వచ్చిన వారికి టీకాలు వేశారు. మండలంలోని ఇప్పటి వరకు 11వేలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిండం జరిగిందని, 3వేలకు మందికి కరోనా టీకాలు వేశామన్నారు.
కరోనా నివారణకు పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్
కరోనా వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే విధంగా సిద్దిపేట పాత బస్టాండ్ పోలీసు కంట్రోల్ రూం వద్ద పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ సిద్దిపేట ట్రాఫిక్ ఇన్చార్జి ఏసీపీ సైదులు బుధవారం ప్రారంభించారు. 8 గంటల వరకే అన్ని దుకాణాలు మూసివేయాలని సూచించారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఆర్ఐ శ్రీధర్రెడ్డి, ఆర్ఎస్సై ఆంజనేయులు, కానిస్టేబుల్ సుధాకర్రెడ్డి, వెంకటేశం, రమేశ్, షాకీర్ తదితరులు పాల్గొన్నారు.
పలు గ్రామాల్లో హైపోక్లోరైట్ స్ప్రే
కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో గ్రామాల్లో నివారణ చర్యలు తీసుకుంటున్నారు. బుధవారం నంగునూరు మండలం ఖాత, అప్పలాయచెరువు, కోనాయిపల్లి గ్రామాల్లోని వీధులలో హైపోక్లోరైట్ స్ప్రే చేశారు. సర్పంచ్లు దశమంతారెడ్డి, గట్టు మల్లవ్వ, వెంకటేశం, ఎంపీటీసీ రవీందర్రెడ్డి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.
చేర్యాల మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో కౌన్సిలర్ చెవిటి లింగం ఆధ్వర్యంలో సోడియం హైఫోక్లోరైట్ ద్రావణాన్ని మున్సిపల్ సిబ్బంది పిచికారీ చేశారు.
మాస్క్ల పంపిణీ
కరోనా వైరస్ విజృంభిస్తున్నందున ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని మున్సిపల్ చైర్పర్సన్ వనితారెడ్డి సూచించారు. దుబ్బాకలో మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా మాస్క్లు, శానిటైజర్లు పంపిణీ చేశారు. మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు వడ్లకొండ శ్రీధర్, కార్యదర్శి బింగి ప్రభాకర్, కార్యవర్గ సభ్యులు బాలముకుందం, జగదీశ్ ఉన్నారు.
ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి
కరోనా పట్ల ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ అన్నారు. గజ్వేల్ భరత్ సమీపంలో నిర్వహించే వారం అంగడీని ఐవోసీ ఎదుట ఖాళీ ప్రదేశంలో నిర్వహించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.
తోగుట, గుడికందుల పాఠశాలలో ఉదయం 7 గంటల నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారం భిస్తున్నామని డాక్టర వెంకటేశ్ తెలిపారు.