న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలోని తెలంగాణ భవన్లో బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్లో హైదరాబాద్ లాల్దర్వాజా సింహావాహిని శ్రీ మహాలక్ష్మి ఆలయం వారు నిర్వహించిన బోనాల ఉత్సవాలకు టీఆర్ఎస్ నాయకులు, రాజ్యసభ సభ్యులు కేశవరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమ్మవారి పూజలో కేశవరావు పాల్గొన్నారు. ఎంపీ కేశవరావు తెలంగాణ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.