గద్వాల, జూన్ 23 : జిల్లాలో పెండింగ్లో ఉన్న డంపింగ్ యార్డు, సెగ్రిగేషన్షెడ్డు, శ్మశానవాటిక పనులు జూలై మొదటి వారంలోగా వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ శృతిఓఝా మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. బుధవారం గద్వాల మండలం గోన్పాడ్ గ్రామ సమీపంలో నిర్మిస్తున్న డంపింగ్ యార్డు, సంగాల చెరువు వద్ద ఏర్పాటు చేస్తున్న పార్కు పనులను కలెక్టర్ పరిశీలించారు. పెండింగ్ పనుల్లో వేగం పెంచేందుకు ఎక్కువ సంఖ్యలో కూలీలను వినియోగించాలన్నారు. పార్కును అభివృద్ధి చేసి ప్రజలను ఆకట్టుకునేలా మొక్కలు నాటాలని సూచించారు. నదీఅగ్రహారం వద్ద నిర్మిస్తున్న శ్మశానవాటిక పనులు పరిశీలించి.. పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లా కేంద్రంలోని చింతలపేట శ్మశానవాటికలో బర్నింగ్ ప్లాట్ఫాం, కంపౌండ్ వాల్ నిర్మాణం పనుల్లో వేగం పెంచాలన్నారు. పట్టణంలోని పాత హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్న పార్కు ను పరిశీలించి మొక్కలు నాటాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ శ్రీహర్ష, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, పబ్లిక్ హెల్త్ ఈఈ విజయభాస్కర్రెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
పట్టణ అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ శృతిఓఝా ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో పురపాలక కమిషనర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానకాలం ప్రారంభమవుతున్న సందర్భంగా జిల్లాలోని అన్ని పురపాలక సంఘాల్లో జరుగుతున్న సీసీరోడ్లు, మురుగు కాలువల పరిశుభ్రత, డ్రైన్ల పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. 13, 14, 15 ఎస్సీ, ఎస్టీ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెండింగ్లో ఉన్న పనులు పురోగతిలోకి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో ఉన్న అన్ని శ్మశానవాటికల వద్ద బర్నింగ్ ప్లాట్ఫాం, వైకుంఠధామాల నిర్మా పనులు జూలై మొదటి వారం వరకు పూర్తి చేయాలన్నారు. పట్టణ ప్రగతికి సంబంధించి నిధులు ఉన్నప్పటికీ పనుల్లో ఆలస్యం జరుగుతుందని.. కాంట్రాక్టర్లతో మాట్లాడి పనులు పూర్తయ్యేలా చూడాలన్నారు. పబ్లిక్టాయిలెట్స్, మిషన్భగీరథ పైపులైన్ల పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. అధికారులు ప్రతి రోజు సైట్ను విజిట్ చేసి పనుల్లో వేగం పెంచాలన్నారు. ప్రధాన రహదారులు, కలెక్టరేట్ ముందు జరిగే పైప్లైన్ పనులు పూర్తి చేయాలన్నారు. అన్ని వైకుంఠధామాల్లో మొక్కలు నాటాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీహర్ష, పురపాలక కమిషనర్లు శ్రీనివాస్రెడ్డి, వేణుగోపాల్, ఈఈ విజయ్భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు