రైస్మిల్లర్స్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిండెంట్ ప్రభాకర్రావు
కరీంనగర్ కార్పొరేషన్, మార్చి 31 : రాష్ట్రంలో సేకరించి న ధాన్యాన్ని నాణ్య త లేదని నిరాకరి స్తూ ఫుడ్కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) అధికారులు రైస్మిల్లర్స్ను ఇబ్బందులకు గురిచేస్తున్నారని రైస్మిల్లర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కిం గ్ ప్రెసిండెంట్ బోయినపల్లి ప్రభాకర్రావు ఆరోపించారు. బుధవా రం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నాణ్యమైన బాయిల్డ్ రైస్ ను అందిస్తున్నా.. కుంటి సాకులతో అధికారు లు కన్సైన్మెంట్లను రద్దు చేస్తున్నారని ఆరోపించారు. 30 ఏండ్లలో ఎప్పుడూ లేనివిధంగా గత రెండేండ్లుగా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పారు. కావాలనే రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించకుండా మిల్లర్లు నష్టపోయేలా చేస్తుంద ని ఆరోపించారు. ఎఫ్సీఐ తీరుతో రా నున్న రోజుల్లో రైస్మిల్లర్స్ ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు వస్తాయని చెప్పారు. పంజాబ్లో 2.15 కోట్ల మె ట్రిక్ టన్నుల బియ్యం తీసుకొన్న ఎఫ్సీఐ.. రాష్ట్రంలో 40 లక్షల మెట్రిక్ టన్నులకే పరిమితమైందన్నారు.
ఇవి కూడా చదవండి:
మహేశ్కు మంత్రి కేటీఆర్ భరోసా
ఆటో వద్దనే భూమి రిజిస్ట్రేషన్
రామాయణం, భారతం ప్రపంచానికే తలమానికం
మన పల్లె ప్రగతికి 12 పురస్కారాలు
స్వచ్ఛ సర్వేక్షణ్లో హైదరాబాద్షా