న్యూఢిల్లీ: దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 27.90 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఒక ప్రకటన చేసింది. కేంద్ర పంపిన 27.90 కోట్ల వ్యాక్సిన్ డోసులలో వ్యర్థమైన వాటితో కలిపి రాష్ట్రాలు 25.32 కోట్ల డోసులను వినియోగించినట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ప్రస్తుతం రాష్ట్రాల దగ్గర 2.58 కోట్లకుపైగా వ్యాక్సిన్ డోసులు అందుబాటులో ఉన్నాయని, మరో రెండు మూడు రోజుల్లో దాదాపు ఇంకో 20 లక్షల డోసులు రాష్ట్రాలకు చేరుకుంటాయాని కేంద్రం స్పష్టంచేసింది. కాగా, దేశంలో కరోనా సెకండ్ ప్రభావం చాలావరకు తగ్గినా వ్యాక్సినేషన్ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతున్నది. అదేవిధంగా దేశవ్యాప్తంగా రోజూ 15 లక్షలకు తగ్గకుండా కరోనా నిర్ధారణ పరీక్షలు చేస్తున్నారు.