పుణె: ఇంగ్లాండ్తో మొదటి వన్డేలో టీమ్ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ దూకుడుగా ఆడుతున్నాడు. సూపర్ ఫామ్లో ఉన్న విరాట్ వన్డేల్లో 61వ అర్ధశతకం నమోదు చేశాడు. 50 బంతుల్లోనే 50 మార్క్ చేరుకున్నాడు. శిఖర్ ధావన్, కోహ్లీ జోడీ 100కు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ప్రమాదకరంగా మారుతున్న జోడీని మార్క్వుడ్ విడదీశాడు. 33వ ఓవర్ తొలి బంతిని కోహ్లీ(56) భారీ షాట్ ఆడగా డీప్ మిడ్వికెట్లో మొయిన్ అలీ చేతికి చిక్కాడు. 33 ఓవర్లు ముగిసేసరికి టీమ్ఇండియా 2 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. మరో ఎండ్లో ధావన్(91) చెలరేగుతున్నాడు.