మేడ్చల్ : మేడ్చల్ జిల్లా శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన జరిగింది. శామీర్ పేట్ చెరువులో దూకి ఇద్దరు వైద్యులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు పాల్పడే ముందు బైక్,బ్యాగులు, సెల్ఫోన్లు చెరువుగట్టుపై వదిలేయడంతో వాటి ఆధారంగా వీరిని అల్వాల్లోని ఓ హోమియోపతి దవాఖానకు చెందిన వైద్యులుగా పోలీసులు గుర్తించారు. ఇద్దరి మృతదేహాల కోసం గజఈతగాళ్ల సాయంతో చెరువులో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.