కొవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొందాం
అన్ని దవాఖానల్లో 20శాతం బెడ్లు కొవిడ్ బాధితులకు రిజర్వు చేయాలి
కలెక్టర్ వెంకట్రావు
మహబూబ్నగర్, ఏప్రిల్ 16 : కరోనా నేపథ్యంలో వైద్యులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ప్రైవేట్ దవాఖాన యాజమాన్యం, సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోజురోజుకూ కొవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ప్రైవేట్ దవాఖానల్లో కొవిడ్ బాధితులకు అవసరమైన బెడ్లను సమకూర్చాలని సూచించారు. గతేడాది మాదిరిగానే జిల్లాలో కొవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొని సంరక్షణ చర్యలు పక్కాగా చేపట్టాలని కోరారు. 10కి మించి బెడ్లు ఉన్న ప్రతి దవాఖానలో తప్పనిసరిగా 20శాతం బెడ్లు కొవిడ్ బాధితులకు రిజర్వు చేయాలన్నారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకేంద్రంలో చికిత్స పొందేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారని, దీనిపై ప్రై వేట్ దవాఖానల యాజమాన్యాలు స్పందించాల్సిన అవస రం ఉందన్నారు. కొవిడ్ బాధితులకు అందించే వైద్యసేవల ను పర్యవేక్షించేందుకు జిల్లాస్థాయిలో మూడు బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. తమ పరిధిలోని దవాఖానలను ప్రతిరోజూ తనిఖీ చేసి నివేదికలను సమర్పించాలని సూచించారు. వీసీలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, డీఎంహెచ్వో కృష్ణ పాల్గొన్నారు.
రోడ్డు విస్తరణ పనుల్లో వేగం పెంచాలి
జిల్లా కేంద్రంలో చేపట్టిన ప్రధాన రహదారి విస్తరణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ వెంకట్రావు అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లాకేంద్రంలో మిగిలిపోయిన రహదారుల విస్తరణ, భవనాల కూల్చివేత, కోర్టు కేసులకు సంబంధించిన కౌంటర్ దాఖలు, విద్యుత్ సమస్య పరిష్కారం, ట్రాన్స్ఫార్మర్ల మార్పు, క్లాక్టవర్ జంక్షన్ అభివృద్ధితోపాటు తదితర పనులపై కలెక్టర్ సమీక్షించారు. పిల్లలమర్రి జంక్షన్ వద్ద వాటర్ పైపులైన్ నిర్మాణ పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అలాగే, రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా భవనాల కూల్చివేతను వేగవంతం చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల కమిషనర్ ప్రదీప్కుమార్, జాతీయ రహదారుల ఈఈ ధర్మారెడ్డి, డీఈ రమేశ్, విద్యుత్ ఎస్ఈ భిక్షపతి తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి
నీ పద్ధతేమీ బాగాలేదు.. సగం షూటింగ్ తర్వాత హీరోకు నో చెప్పిన కరణ్
అన్ని యూనివర్సిటీల పరీక్షలు వాయిదా