హైదరాబాద్ : ప్రజల ప్రాణాలే అత్యంత ప్రాధాన్యతగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య సేవలు పటిష్టం చేస్తున్నారని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఇందులో భాగంగా వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ సందర్శించి, కొవిడ్ రోగులను పరామర్శించి, వరంగల్ సెంట్రల్ జైలును సూపర్ స్పెషాలటీ హాస్పిటల్ గా ఏర్పాటు చేస్తామని ప్రకటించిన సీఎం కేసీఆర్ నిర్ణయం సాహసోపేతమైందన్నారు. అందుకు గాను జిల్లా ప్రజల తరఫున సీఎంకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ఓరుగల్లు వాసులంటే సీఎంకు ప్రత్యేకమైన ప్రేమ ఉందన్నారు. అందుకే హైదరాబాద్ తర్వాత అత్యంత ప్రాధాన్యత వరంగల్ నగరానికి ఇస్తూ అన్ని రంగాల్లో ఈ పట్టణాన్ని హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేసే కృషి చేస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో వరంగల్ మెడికల్ హబ్గా మారనుందన్నారు.
సీఎం కేసీఆర్ ముందు చూపుతో అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ తెలంగాణను అగ్రగామిగా మారుస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన లాక్ డౌన్ నిబంధనలు అందరూ పాటించాలన్నారు.
కరోనా వస్తే కంగారు పడాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు.
ఇవి కూడా చదవండి..
దాతృత్వం స్ఫూర్తి దాయకం : మంత్రి జగదీష్ రెడ్డి
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
తెలంగాణ- ఆంధ్రా సరిహద్దులో ఆంక్షలు కఠినతరం
నేను రాను బిడ్డో అంటున్న ఫాదర్ స్టాన్ స్వామి