ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్ వాయిదా పడడంతో లీగ్ కోసం భారత్కు వచ్చిన న్యూజిలాండ్ క్రికెటర్లు స్వదేశానికి చేరుకున్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, కోల్కతా నైట్రైడర్స్ హెడ్కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్తో పాటు మరికొంత మంది ఆటగాళ్లు ఇవాళ స్వస్థలాలకు వెళ్లారు. మెక్కల్లమ్, ఫ్లెమింగ్లతో పాటు లాకీ ఫర్గుసన్, అంపైర్ క్రిస్ గఫానీ, కామెంటేటర్లు సైమన్ డౌల్, స్కాట్ స్టైరీస్ ఆదివారం సాయంత్రం(స్థానిక కాలమానం ప్రకారం) ఆక్లాండ్కు చేరుకున్నారు. న్యూజిలాండ్ బృందం టోక్యో మీదుగా కివీస్ బయల్దేరి వెళ్లింది.
పేసర్ ట్రెంట్ బౌల్ట్, ఆడమ్ మిల్నే, ఫిన్ అలెన్, జిమ్మీ నీషమ్లు శనివారమే అక్కడకు వెళ్లారు.కోల్కతా నైట్రైడర్స్, కివీ బ్యాట్స్మన్ టిమ్ సీఫర్ట్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో భారత్లోనే ఉండిపోయాడు.