లక్నో: ఉత్తర ప్రదేశ్లోని ఉన్నావోలో ఆందోళనకారుల రాళ్ల దాడి నుంచి రక్షణ కోసం పోలీసులు ప్లాస్టిక్ కుర్చీలు, తట్టలు వినియోగించారు. దీనిపై పోలీస్ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నలుగురు పోలీసులతోపాటు ఎస్హెచ్వోను స్పస్పెండ్ చేశారు. అక్రంపూర్లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు పురుషులు మరణించారు. బుధవారం పోస్ట్మార్టం అనంతరం వారి మృతదేహాలను ప్రమాదం జరిగిన చోటకు తీసుకువచ్చిన బంధువులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులపైకి కొందరు రాళ్లు రువ్వారు. దీంతో కొందరు పోలీసులు ప్లాస్టిక్ స్టూల్, తట్ట వంటి వాటిని రక్షణగా వినియోగించారు.
అయితే ఈ ఫొటోలు, వీడియోలు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. శాంతిభద్రతల పరిరక్షణ కోసం అన్ని పోలీస్ స్టేషన్లకు రక్షణ సామాగ్రి ఇచ్చినప్పటికీ వృత్తిపరంగా వ్యవహరించక అసమర్థతగా వ్యవహరించిన ఎస్హెచ్వో దినేష్ చంద్ర మిశ్రాతో పాటు మరో ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేయాలని లక్నో రేంజ్ ఐజీ లక్ష్మీ సింగ్ ఆదేశించారు.