ఈ నెలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకస్మిక పర్యటనలు
కలెక్టర్లతోపాటు అధికారులు పల్లె నిద్ర చేయాలి
లక్ష్యాలు సాధించని అధికారులపై చర్యలు
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్
ఉమ్మడి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం
ఖమ్మం, జూన్17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) :కలెక్టర్లతోపాటు అధికారులు అందరూ పల్లె, పట్టణ ప్రగతి పనులను పరిశీలించి ‘పల్లె నిద్ర’కు ఉపక్రమించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. పట్టణ, పల్లె ప్రగతి, హరితహారం కార్యాచరణపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో గురువారం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి పనులపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ప్రతి పంచాయతీ, పురపాలక సంఘాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఖమ్మం, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సీజనల్ వ్యాధులు దరిచేరకుండా ఉండాలంటే ప్రతి పంచాయతీ, పురపాలక సంఘాల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టిసారించాలని, కలెక్టర్లతోపాటు అధికారులు అందరూ పల్లె, పట్టణ ప్రగతి పనులను పరిశీలించి పల్లెల్లో నిద్రకు ఉపక్రమించాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సూచించారు. పట్టణ, పల్లె ప్రగతి, హరితహారం ప్రణాళికపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు, ప్రజాప్రతినిధులతో గురువారం భక్తరామదాసు కళాక్షేత్రంలో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు చేపట్టిన పట్టణ, పల్లె ప్రగతి పనులపై అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్కుమార్ మాట్లాడుతూ గతంలో పల్లె, పట్టణ ప్రగతిలో పారిశుధ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడంతో గతేడాది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో డెంగ్యూ, చికెన్గున్యా, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు తక్కువగా నమోదయ్యాయని, అదే ఒరవడి కొనసాగించాలన్నారు. పోడు భూముల సమస్యలపై అటవీ అధికారులు నిబంధనల మేరకు వ్యవహరించాలన్నారు.
వివాదంలో ఉన్న భూముల జోలికి వెళ్లరాదని ఆదేశాలున్నా.. కొన్నిచోట్ల అటవీ అధికారులు, సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ట్రెంచ్లు కొడుతున్నారని పేర్కొన్నారు. అటవీశాఖ అధికారులూ ప్రభుత్వంలో భాగస్వాములేనన్న విషయాన్ని గుర్తించాలని, గిరిజనులు సాగు చేసుకునే పోడు భూములపై ప్రభుత్వ ఆదేశాలను పాటించాలని ఆదేశించారు. పట్టణ, పల్లెప్రగతి ద్వారా గుణాత్మక మార్పులు తీసుకొచ్చామని, ఇదే స్ఫూర్తితో అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేసి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ, పల్లెప్రగతి ద్వారా పట్టణాలు, నగరాలు, పల్లెల్లో పరిశుభ్రమైన వాతావరణాన్ని కల్పించామని పేర్కొన్నారు. గ్రామాల్లో పెండింగ్లో ఉన్న వైకుంఠధామాలు, డంపింగ్యార్డులు, కంపోస్ట్ షెడ్లు, పల్లె ప్రకృతి వనాలు, మిగులు పనులన్నీ వారం రోజుల్లోపు పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్లతోపాటు మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఏపీవోలు తప్పనిసరిగా పల్లెల్లో నిద్ర చేసి గ్రామాల్లో పారిశుధ్య పనులను తనిఖీ చేయాలన్నారు. ఈ నెల 20వ తేదీ తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తారని, పల్లె ప్రగతి పనులు ఆకస్మిక తనిఖీలు ఉంటాయన్నారు. సింగరేణి, కామేపల్లి, తిరుమలాయపాలెం, ఏన్కూరు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆళ్లపల్లి, పినపాక, జూలురుపాడు, అశ్వారావుపేట, టేకులపల్లి మండలాల్లో పల్లె ప్రగతి పనులు పెండింగ్లో ఉన్నాయన్నారు. వాటిని వారంలోపు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.
హరితహారం మొక్కల సంరక్షణ
ఉమ్మడి జిల్లాలో హరితహారంలో నాటిన మొక్కలు 85 శాతం సజీవంగా ఉండేలా సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. రహదారులకు ఇరువైపుల మొక్కలు పెంచాలన్నారు.
ఖమ్మం జిల్లా కలెక్టర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ గ్రామాల్లో పల్లె ప్రగతి పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయాలని, లేదంటే బాధ్యులపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జిల్లాలో డ్రైడే, యాంటీ లార్వా, కార్యక్రమాల ద్వారా సీజనల్ వ్యాధులు తగ్గాయన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ జిల్లాలో పల్లె ప్రగతి పనుల్లో పూర్తిస్థాయిలో లక్ష్యాలు సాధించని మండలాలపై ప్రత్యేక దృష్టిసారించి, వారం రోజుల్లో పనులన్నీ పూర్తి చేయాలని కోరారు.
మంత్రి చొరవ అభినందనీయం
-ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పోడు భూముల సమస్యలపై మంత్రి పువ్వాడ అజయ్కుమార్ తీసుకొన్న చొరవ అభినందనీయమని, గిరిజనుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి శ్వాసతంగా పరిష్కరించాలని ప్రభుత్వ విప్ రేగా కాంతరావు కోరారు. వైరా, ఇల్లెందు ఎమ్మెల్యేలు రాములునాయక్, హరిప్రియ మాట్లాడుతూ పట్టణ, పల్లె ప్రగతి లక్ష్యాలను చేరుకోవాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఖమ్మం జడ్పీ చైర్పర్సన్ లింగాల కమల్రాజు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, వైరా, సత్తుపల్లి, మధర, కొత్తగూడెం, మన్సిపల్ చైర్మన్లు సూతగాని జైపాల్, మహేష్, మొండితోక లత, దమ్మాలపాటి వెంకటేశ్వర్లు, కాపు మహాలక్ష్మీ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, అదనపు కల్టెర్లు స్నేహలత, ఎన్.మధుసూదన్, నగరపాలకసంస్థ కమిషనర్ అనురాగ్జయంతి, జడ్పీసీఈవోలు ప్రియాంక, విద్యాలత, డీపీలోలు ప్రభాకర్రావు, రమాకాంత్, డీఎఫ్వోలు ప్రవీణ, రంజిత్నాయక్, డీఎంహెచ్వోలు డాక్టర్ మాలతి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, మండల ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు.