కరీంనగర్ రూరల్, ఏప్రిల్ 21: మండలంలోని బొమ్మకల్ సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణాన్ని అర్చకులు కొవిడ్ నిబంధనలు పాటిస్తూ జరిపించారు. భక్తులు పరిమిత సంఖ్యలో హాజరై కల్యాణాన్ని తిలకించారు. దుర్శేడ్ వేణుగోపాల స్వామి ఆలయంలో అర్చకుడు మధుసూదనాచార్యులు సీతారాముల కల్యాణం జరిపించగా, సర్పంచ్ గాజుల వెంకటమ్మ, భక్తులు పాల్గొన్నారు. చేగుర్తి వేణుగోపాలస్వామి ఆలయంలో వేద పండితుడు శ్రీనివాసాచార్యులు, అర్చకుడు సముద్రాల వెంకటేశ్వర్లు, ఆలయ కమిటీ చైర్మన్ అశోక్గౌడ్ దంపతులు సీతారాముల కల్యాణం జరిపించారు. సింగిల్ విండో చైర్మన్ బల్మూరి ఆనందరావు, సర్పంచ్ చామనపల్లి అరుణారాజయ్య, ఉపసర్పంచ్ విజయ, అంజయ్య, మాజీ సర్పంచ్ బల్మూరి భాగ్యలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఎలబోతారం హనుమాన్ ఆలయంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ మహోత్సవంలో సర్పంచ్ లక్ష్మీగౌతంరెడ్డి, ఎంపీటీసీ చల్ల రామక్కలింగయ్య, ఉపసర్పంచ్, ఆర్బీఎస్ గ్రామ కో-ఆర్డినేటర్ కట్ల సంజీవ్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. జూబ్లీనగర్ సీతారామచంద్ర స్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో ఉపసర్పంచ్ కుమార్, వార్డు సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. చెర్లభూత్కూర్ వేణుగోపాలస్వామి ఆలయంలో నిర్వహించిన వేడుకల్లో అర్చకుడు శ్రీనివాసాచార్యులు, సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఉపసర్పంచ్ చిట్కూరి శేఖర్, ఎంపీటీసీ బుర్ర తిరుపతిగౌడ్, సింగిల్ విండో చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్రెడ్డి, నరేశ్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. తీగలగుట్టపల్లి సీతారామచంద్రస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. కార్పొరేటర్లు కాశెట్టి లావణ్య, కొలగాని శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకుడు కాశెట్టి శ్రీనివాస్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.