Hardeep Singh Puri on Metro | దేశవ్యాప్తంగా వచ్చే ఏడాదినాటికి 900 కి.మీ. మేర మైట్రో రైలు సర్వీసులు అందుబాటులోకి తేవడానికి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ చెప్పారు. శనివారం ఆయన ఢిల్లీలోని నజఫ్గఢ్-డాన్సా బస్టాండ్ మెట్రో సెక్షన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా హర్దీప్ సింగ్ పూరీ మాట్లాడుతూ ఆధునిక, వేగవంతమైన రవాణా సౌకర్యాల కోసం దేశవ్యాప్తంగా మెట్రో రైల్ వ్యవస్థల విస్తరణ పనులు ముమ్మరం చేశామన్నారు.
దేశ ఆర్థిక వ్యవస్థలో మెరుగైన ప్రజా రవాణా కీలక పాత్ర పోషిస్తుందని హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో 740 కిలోమీటర్ల మేరకు మెట్రో రైల్ లైన్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. వివిధ నగరాల పరిధిలో 1000 కి.మీ విస్తీర్ణంలో మెట్రో రైల్ లైన్లు నిర్మాణంలో ఉన్నాయన్నారు.
ఈ మెట్రో సర్వీసుల్లో ప్రతి రోజూ 85 లక్షల మంది ప్రయాణిస్తున్నారని హర్దీప్ సింగ్ పూరీ అన్నారు. మెట్రో రైల్ వ్యవస్థలతో పట్టణాల రూపురేఖలే మారిపోయాయని అభిప్రాయ పడ్డారు.