మహబూబాబాద్ రూరల్ , మార్చి 29 : ప్రజా సంక్షేమ మే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శంకర్నాయక్ పేర్కొన్నారు. సోమవారం పంటణ కేంద్రంలోని ఏటిగడ్డతండా లోని రైతువేదికలో మండలానికి చెందిన 132 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు నిరుపేద ప్రజలను పట్టించుకోలేదన్నారు. మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ చిల్యాల జనార్దన్, నాయకులు గద్దె రవి, గోగుల రాజు, టీ శ్రీను, కే గోపి, రవీంద్రాచారి, ఎమ్మార్వో రంజిత్ కుమార్, ఆర్ఐ ప్రవీణ్ రెడ్డి పాల్గొన్నారు.
గూడూరు : కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో పేం దింటి పెద్దన్నగా సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఖాసీం అన్నారు. సోమవా రం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల సంక్షేమాని ప్ర భుత్వం ఎంతో కృషి చేస్తున్నదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శైలజ, ఎంపీటీసీ రాధిక, సర్పంచ్లు, లబ్ధ్దిదారులు పాల్గొన్నారు.