ముంబై: తనపై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్బీర్ సింగ్ చేసిన ఆరోపణలపై రిటైర్డ్ జడ్జి విచారణ జరుపుతారని వెల్లడించారు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్. గత గురువారమే తనపై విచారణ జరపాలని కోరుతూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు ఆయన లేఖ రాశారు. ముంబై పోలీస్ కమిషనర్గా చేసిన పరమ్ బీర్ సింగ్ రాసిన లేఖ అధికార కూటమిలో ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే.
నెలకు రూ.100 కోట్లు వసూలు చేయాల్సిందిగా అనిల్ దేశ్ముఖ్ పోలీస్ ఆఫీసర్ సచిన్ వాజేను ఆదేశించినట్లు ఆ లేఖలో పరమ్ బీర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను హోంమంత్రితోపాటు కూటమిలో భాగమైన ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ కూడా ఖండించారు. ఆ సమయంలో అనిల్ దేశ్ముఖ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని వాళ్లు వాదించారు. అయినా కూడా ఈ ఆరోపణలపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి రిటైర్డ్ జడ్జి ద్వారా విచారణ జరిపిస్తారని అనిల్ దేశ్ముఖ్ ఆదివారం స్పష్టం చేశారు. రిటైర్డ్ హైకోర్టు జడ్జి ద్వారా విచారణ జరిపించాలని ఉద్ధవ్ థాక్రే నిర్ణయించినట్లు ఆయన వెల్లడించారు.
ఇవికూడా చదవండి..
100 కోట్లు ఇవ్వండి.. కేంద్రాన్ని కోరిన భారత్ బయోటెక్, సీరమ్
సుయెజ్ కాలువలో ఇరుక్కున్న ఎవర్గివెన్ షిప్ కాస్త కదిలింది
ప్రపంచంలో సెక్సీయెస్ట్ బాల్డ్ మ్యాన్.. ప్రిన్స్ విలియమ్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
కోహ్లి అడిగాడు.. సాఫ్ట్ సిగ్నల్కు నో చెప్పిన బీసీసీఐ
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి