నాగర్కర్నూల్ : మినీ పురపోరుకు నామినేషన్ల ప్రక్రియ గడువు ముగిసింది. రాష్ట్రంలోని రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్ వరంగల్, ఖమ్మం నగర పాలికలతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్ పురపాలికలకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ను జారీ చేసింది. గత మూడు రోజులుగా కొనసాగిన నామినేషన్ల స్వీకరణ ఆదివారం సాయంత్రంతో ముగిసింది.
నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో మొత్తం 148 నామినేషన్లు దాఖలయ్యాయి. మొదటి రోజు 4, రెండవ రోజు 45, మూడవ రోజు 99.. మొత్తం 148 నామినేషన్లు దాఖలైనట్లు అసిస్టెంట్ ఎన్నికల అధికారి శ్రీహరి రాజు వెల్లడించారు. మూడవ రోజైన ఆదివారం టీఆర్ఎస్ నుంచి 34 , కాంగ్రెస్-35, బీజేపీ-21, స్వతంత్ర అభ్యర్థులు-7, ఎంఐఎం-2 చొప్పున మొత్తం 99 నామినేషన్లు నామినేషన్లు దాఖలైనట్లు పేర్కొన్నారు.