బెంగుళూరు: కర్నాటకలోని బొమ్మనహల్లికి చెందిన ఎమ్మెల్యే సతీశ్ రెడ్డి ఇంటి ముందు పార్క చేసిన రెండు వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటన గత రాత్రి జరిగింది. ఈ ఘటనలో రెండు కార్లు దగ్ధం అయ్యాయి. మహేంద్ర థార్, ఫార్చూనర్ కార్లకు దుండగులు నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. తెల్లవారుజామున 1.25 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. పెట్రోల్ క్యాన్లతో వచ్చిన దుండగులు ఎమ్మెల్యే ఇంటి గేటును దూకి లోపలికి ప్రవేశించారు. ఆ తర్వాత వాహనాలపై పెట్రోల్ పోసి వాటిని అంటించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్లు డిప్యూటీ కమీషనర్ శ్రీనాథ్ మహాదేవ్ జోషి తెలిపారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీని పరిశీలిస్తున్నట్లు పోలీసులు చెప్పారు.