చండీగఢ్: పంజాబ్లో కొత్త సీఎం ఎవరనే విషయంలో అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరోసారి పునరుద్ఘాటించారు. నూతన సీఎం ఎంపిక విషయంలో తమ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామని, ఆమె నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే మరోసారి సీఎల్పీ సమావేశం ఏర్పాటుచేసి నాయకుడిని ఎన్నుకుంటామని ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ చెప్పారు. అమరీందర్ సింగ్ రాజీనామా చిన్న విషయం కాదని, ఆయన రాజీనామా పెద్ద బ్యాక్గ్రౌండే ఉందన్నారు.
అమరీందర్సింగ్ పనితీరుపై తమ పార్టీ ఎమ్మెల్యేల్లో చాలామందికి అసంతృప్తి ఉన్నదని కుల్దీప్ సింగ్ తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్లో తదుపరి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న మీడియా ప్రశ్నకు.. అన్నీ అధిష్ఠానంపై ఆధారపడి ఉంటాయని మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్గత్ సింగ్ చెప్పారు. కొత్త సీఎం ఎంపిక, ఇతర అంశాలపై పూర్తి నిర్ణయాధికారులు అధిష్టానానికే అప్పగిస్తూ శనివారం జరిగిన సీఎల్పీ సామవేశంలో తీర్మానం చేశామని ఆయన తెలిపారు.