జైపూర్: రాజస్థాన్కు చెందిన స్వతంత్య్ర ఎమ్మెల్యే రామ్కేశ్ మీనా.. జై శ్రీరామ్ అని రాసి ఉన్న కషాయ జెండాను చింపేశారు. ఈ ఘటన జైపూర్లో ఉన్న ఆమాఘర్ ఫోర్ట్లో చోటుచేసుకున్నది. కోటపై ఎగిరేసిన జెండా వద్దకు భారీ సంఖ్యలో మద్దతుదారులతో వెళ్లిన ఎమ్మెల్యే దాన్ని కూల్చేశారు. ఈ ఘటన పట్ల హిందూ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మీనా వైఖరిని ఖండించారు. కొన్ని రోజుల క్రితం ఇదే ప్రాంతంలో ఉన్న శివలింగాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు.