రాజాపూర్, జనవరి 7: కాచిగూడ నుంచి తిరుపతి వెళ్తున్న సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్ రైలుకు ప్రమాదం తప్పింది. ఎస్9 బోగిలో షార్ట్సర్క్యూట్ రావడంతో పొగలు వ్యాపించాయి. శుక్రవారం సాయత్రం కాచిగూడ నుంచి తిరుపతికి బయలుదేరిన సెవెన్హిల్స్ ఎక్స్ప్రెస్ రైలు రంగారెడ్డిగూడ రైల్వేస్టేషన్ సమీపంలోకి రాగానే పొగలు రావడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. వెంటనే రైల్వే సిబ్బంది, అధికారులు ఎస్9 బోగిలో షార్ట్సర్క్యూట్ సమస్యను సరిచేసి రైలును యథావిధిగా పంపారు. రైల్వే అధికారుల అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. దీంతో రైలు అరగంట ఆలస్యంగా బయల్దేరింది.