మరికల్, జూలై 5 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలతో పల్లెలన్నీ కొత్త శోభను సంతరించుకున్నాయని, పచ్చదనం, పరిశుభ్రతకు పెద్దపీట వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రా మారావు అన్నారు. సోమవారం మండలంలోని అప్పంప ల్లిలో పర్యటించి పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. గ్రా మం పచ్చదనంతోపాటు పరిశుభ్రంగా ఉందన్నారు. ప్రతి ఇంటికీ కచ్చితంగా ఆరు మొక్కలు ఇచ్చి వాటిని నాటి సంరక్షించుకొనే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పల్లె ప్రకృతి వనంలో ఇంకా పలు రకాల మొ క్కలను నాటాలన్నారు. పంచాయతీ కార్యాలయం వద్ద మొక్కలు బాగున్నాయన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తి రుపతిరెడ్డి, పంచాయతీరాజ్ జిల్లా అధికారి మురళి, ఎంపీడీవో యశోదమ్మ, ఎంపీవో బాలాజీ, అంగన్వాడీ టీచర్లు, ఆశ కర్యకర్తలు, కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
ఉందేకోడ్ సందర్శన
నర్వ, జూలై 5 : మండలంలోని ఉందేకోడ్ గ్రామాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రామారావు ఆకస్మికంగా సందర్శించారు. డీపీవో మురళితో కలిసి గ్రామం లో కొనసాగుతున్న పల్లె ప్రగతి పనులను పరిశీలించారు. దళితవాడ, బీసీ కాలనీలో సందర్శించి మౌలిక సదుపాయా ల కల్పన ఇంకా మెరుగుపర్చాలన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీ కాల్వలను ఏర్పాటు చేయాలని ఎంపీడీవో రమేశ్కుమార్కు సూచించారు. గ్రామంలోని నర్సరీ, వైకుంఠధామం, వర్మీ కంపోస్టు షెడ్డ్ను పరీశీలించారు. ప్రజలు తడి, పొడి చెత్తను వేర్వురుగా వేసేలా అవగాహన కల్పించాలన్నా రు. గ్రామం లో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి శివప్రసాద్రెడ్డి, సర్పంచ్ పావని, ఉప సర్పం చ్, కార్యదర్శి బాలస్వామి, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ప్రతి ఇంటా ఆరు మొక్కలు నాటాలి
మక్తల్ రూరల్, జూలై 5 : ప్రతిఒక్కరూ ఇంటి ఎదుట ఆరు మొక్కలు నాటాలని జెడ్పీ చైర్పర్సన్ వనజాగౌడ్ పిలుపునిచ్చారు. మండలంలోని మంథన్గోడ్లో పల్లె ప్రగతిలో భాగంగా ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన గ్రామసభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ యజ్ఞంలా చేపట్టారన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా వాతావరణ కాలుష్యం పెరిగిపోతుందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్ర తిఒక్కరూ మొక్కలను నాటి పెంచకపోతే భావితరాలకు ముప్పు ఏర్పడుతుందన్నా రు. థర్డ్ వేవ్ కరోనా వైరస్ రాకుండా నివారించడానికి ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని ఆమె సూచించా రు. అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లోని ప్రతి ఇంటా మరుగుదొడ్డి నిర్మించుకోవాలని ఆదేశించారు. మరుగుదొడ్డి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందజేస్తుందన్నారు. అందుకు ప్రజలు ముందుకు రాకపోవడం శోచనీయమని ఆయన విచారం వ్యక్తం చేశారు. ముఖ్యంగా గ్రా మాల్లో సర్పంచులు పారిశుధ్య నివారణ చర్యలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన పిలుపునిచ్చారు. జీపీ నిధులను శా నిటైజేషన్ కోసం ఖర్చు పెట్టాలన్నారు. కార్యక్రమంలో ఎం పీపీ వనజ, ఎంపీడీవో శ్రీధర్, స్పెషల్ అధి కారి జాన్ సు ధాకర్, ఎంపీటీసీ సుమిత్ర, ఉపసర్పంచ్ కృష్ణయ్యగౌడ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
దామరగిద్ద మండలంలో…
దామరగిద్ద, జూలై 5 : మండలంతోపా టు కందెన్పల్లి, ముస్తాపేట, అన్నాసాగర్ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు కొసాగుతున్నాయి. మండలంలోని గ్రామ సిబ్బంది రోడ్లను శుభ్రం చేసి బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ముస్తాపేటలో డంపింగ్ యార్డ్, శ్మశానవాటిక, పల్లె ప్రకృతి వనాన్ని మండల ప్రత్యేకాధికారి వేణుగోపాలరావు పరిశీలించారు. అనంతరం అంగన్వాడీ, ప్రాథమిక పాఠశాలను సందర్శించి హర్షం వ్యక్తం చేశారు. కా ర్యక్రమంలో సర్పంచులు, అంగన్వాడీ టీ చర్లు, ఆశ కర్యకర్తలు, గ్రామ కార్యదర్శులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
ధన్వాడ మండలంలో…
ధన్వాడ, జూలై 5 : మండలంతోపాటు రాంకిష్టయ్యప ల్లి, కిష్టాపూర్, కొండాపూర్, కంసాన్పల్లి, పాతపల్లి, గున్ము క్ల, గోటూర్, కొండ్రోన్పల్లి గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. కొండ్రోన్పల్లిలో పంచాయతీ సిబ్బంది కాలనీల్లో చెత్త సేకరణ, కంప చెట్లు తొలగింపు, మొక్కలు నాటడం, శానిటైజర్, రోడ్లను ఊడ్చడం లాంటి కార్యక్రమాలు చేపట్టారు. సర్పంచులు, కార్యదర్శులు పనులను పర్యవేక్షించారు.
‘పల్లె ప్రగతితోనేగ్రామాల అభివృద్ధి’
కృష్ణ, జూలై 5 : పల్లె ప్రగతితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యమని సర్పం చ్ మహదేవమ్మ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కా వాలని కోరారు. మండలంలోని గుడెబలూర్, ముడుమాల, హిందుపూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టారు. గ్రామ పంచాయతీ ఆవరణ, రోడ్ల పక్కన సర్పంచులు ప్రజలతో కలిసి మొక్కలు నాటారు. గ్రామాల అభివృద్ధితోపాటు పరిశుభ్రత, పచ్చదనంతో సుందరంగా ఉం డాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. కార్యక్రమంలో నా యకులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట మండలంలో…
నారాయణపేట రూరల్, జూలై 5 : మండలంలోని వివి ధ గ్రామాల్లో పల్లె ప్రగతి పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామాల్లో పారిశుధ్యం, విద్యుత్ సమస్యల పరి ష్కారం కోసం పనులు చేపట్టారు. సింగారం, ఊటకుంటతండా, జాజాపూర్, శేర్నపల్లి, చిన్నజట్రం, అంత్వార్, లక్ష్మీపూర్ తదితర గ్రామాల్లో వార్డుల వారీగా పంచాయతీ సి బ్బంది పర్యటించారు. చెత్తాచెదారం, పరిసరాల్లో పిచ్చి మొ క్కలు తొలగించారు. అలాగే గ్రామాల్లో విరిగిపోయిన వి ద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఊటకుంటతండాలో సర్పంచ్ సీతమ్మ, జాజాపూర్లో సుగంధమ్మ, అప్పక్పల్లిలో వెంకటమ్మ గ్రా మాల్లో పర్యటించి పారిశుధ్య పనులు చేయించారు. కార్యక్రమంలో గ్రామ కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.
జోరందుకున్న పల్లె ప్రగతి పనులు
ఊట్కూర్, జూలై 5 : పల్లె ప్రగతిలో భాగంగా ప్రజాప్రతినిధులు, పంచాయతీ ఉద్యోగులు జోష్ పెంచారు. ఆయా గ్రామాల్లో పర్యటించి కీలక సమస్యలను పరిష్కరించడాని కి నడుంబిగించారు. రోడ్లపై చెత్తను ఊడ్చి శుభ్రం చేశారు. రహదారులకు ఇరు వైపులా పిచ్చి మొక్కలు, ముళ్ల పొద లు, పెంట కుప్పలు తొలగించారు.
మొక్కలు నాటి ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. మండలంలో సర్పంచ్ సూర్యప్రకాశ్రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ పది మొక్కలను అందజేశారు. తిప్రాస్పల్లిలో సర్పంచ్ సు మంగళ ఆధ్వర్యంలో మురుగు కాల్వలను శుభ్రం చేశారు. చిన్నపొర్ల సర్పంచ్ రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో పాత విద్యుత్ స్తంభాలను తొలగించి కొత్త స్తంభాలను ఏర్పాటు చేశారు. జెడ్పీ సీఈవో సిద్ధి రామప్ప హాజరై గ్రామంలో డంపింగ్ యార్డు, శ్మశానవాటిక, రైతువేదికను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసి గ్రామాభివృద్ధిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీవో కాళప్ప, ఎంపీవో రవికుమార్, ఉపాధి ఏపీవో ఎల్ల య్య, ఈసీ శ్రీనివాసులు, టీఏలు, కార్యదర్శులు, అంగన్వాడీ టీచర్లు, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.