న్యూఢిల్లీ: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం పశ్చిమబెంగాల్లో హింస చెలరేగిన నేపథ్యంలో ఆ రాష్ట్రంలో శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని గవర్నర్ జగదీప్ ధన్కర్ను కేంద్ర హోంశాఖ కోరింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. బెంగాల్ గత ఆదివారం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడగానే పలు ప్రాంతాల్లో తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య గొడవలు జరిగాయి. చాలాచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
కాగా, ఈ ఘటనలపై తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తృణమూల్ గూండాలే తమ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని బీజేపీ నేతలు ఆరోపిస్తుండగా, బీజేపీ గెలిచిన ప్రాంతాల్లోనే హింస చెలరేగిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జి విమర్శించారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ను రాష్ట్రంలో శాంతిభద్రతలపై నివేదిక సమర్పించాలని కోరింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఆర్ఎల్డీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత
దర్శకుడికి కరోనా.. చికిత్సకు సాయం చేసిన కమెడీయన్
ఇంటినుంచే ఇంజినీరింగ్ పరీక్షలు
తెలంగాణలో కొత్తగా 6,026 కరోనా కేసులు