ఎలిగేడు, ఏప్రిల్ 20: రైతన్నకు రాష్ట్ర ప్రభు త్వం అన్నివేళలా అండగా ఉంటుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఎలిగేడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఉప మార్కెట్ యార్డులో, నర్సాపూర్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రైతన్న ఆర్థికంగా ఎదిగినప్పుడే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, అదే క్రమంలో రైతులంతా విధిగా బీమా చేయించుకోవాలన్నారు. దాని కోసం ప్రభుత్వం అహర్నిశలూ కృషిచేస్తుందన్నారు. రైతులు పండించిన చి వరి గింజవరకూ ప్రభుత్వం కొంటుందని ఎమ్మె ల్యే భరోసా ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో మండలంలోని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు.
వైద్యుల సలహాలను పాటిస్తూ మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలన్నారు. సింగిల్ విండో చైర్మన్ గోపు విజయభాస్కర్రెడ్డి, జడ్పీ వైస్ ప్రెసిడెంట్ మండిగ రేణుక, ఎంపీపీ తానిపర్తి స్రవంతి, ఉపాధ్యక్షుడు బుర్ర వీరస్వామిగౌడ్, సర్పంచ్ బూర్ల సింధూజ, ఉపసర్పంచ్ కోరుకంటి వెంకటేశ్వరరావు, నర్సాపూర్ సర్పంచ్ తంగెళ్ల స్వప్న, గ్రామ టీఆర్ఎస్ నాయకులు, జిల్లా సహకార అధికారి (డీసీవో) మైఖేల్బోస్, ఎంపీడీవో శ్రీనివాస మూర్తి, తహసీల్దార్ పద్మావతి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి రాంరెడ్డి, మాజీ అధ్యక్షుడు తానిపర్తి మోహన్రావు, తంగెళ్ల కుమారస్వామియాదవ్, గొల్లె భూమేశ్, సింగిరెడ్డి రాజేశ్వర్రెడ్డి, బూర్ల వెంకటసత్యం, సింగిల్విండో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)కేశెట్టి విక్రం, కార్యాలయ సిబ్బం ది, వివిధ గ్రామాల నాయకులు పాల్గొన్నారు.
దళారులకు విక్రయించి నష్టపోవద్దు
ధాన్యాన్ని దళారులకు విక్రయించి నష్టపోవద్దవని ఎమ్మెల్యే దాస రి మనోహర్రెడ్డి సూచించారు. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ధాన్యాన్ని కేంద్రాలకు తెచ్చి అమ్ముకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాల వద్ద పక్కాగా కొవిడ్ నిబంధనలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్రం నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు శంకర్నాయక్, వైస్ చైర్మన్ జడల సురేందర్, మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పృథ్వీరాజ్, డైరెక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.