ముంబై : కంచిపట్టు చీరలో కంగనా రనౌత్ ధగధగ మెరిసిపోయింది. తలైవీ ట్రైలర్ ఆవిష్కరణ సందర్భంగా ముంబైలో జరిగిన కార్యక్రమంలో కంగనా తన చీర కట్టుతో అందర్నీ అట్రాక్ట్ చేసింది. ట్రైలర్ లాంచింగ్ కోసం ఆమె ఆరెంజ్, గోల్డ్ కలర్ పట్టుచీరలో వచ్చింది. ఆమె అందాల్ని చూసి అందరూ ముగ్దులయ్యారు. చీరలో ఎంత అందంగా కనిపించిందంటే.. ఆ వేడుకకు హాజరైన ప్రతి ఒక్కరూ ఆమె నుంచి చూపును తిప్పుకోలేకపోయారు. నాలుగుసార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న కంగనా రనౌత్.. నిన్నే తన 34వ పుట్టిన రోజు జరుపుకున్నది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తీసిన తలైవీ చిత్రంలో కంగనా రనౌత్ నటిస్తోంది.
ఓపెన్ టాప్ కారులో కంగనా.. ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి వచ్చింది. ప్రేక్షకులకు రెండు చేతులు జోడిస్తే నమస్తే పెట్టింది. కంచీపురం సిల్క్ చీరలో ధగధగ మెరిసిపోయిన కంగనాను చూస్తూ అక్కడ ఉన్నవారు కాస్త కవ్వింతకు లోనయ్యారు. నుదిటపై ఎర్రటి బొట్టు, మెడలో నక్లెస్ హారం, జడలో మల్లెపువ్వులు పెట్టిన కంగనా.. చాలా ఆకర్షణీయమైన లుక్లో ట్రైలర్ ఈవెంట్లో పాల్గొన్నది. తలైవీ సినిమాలో ఎంజీ రామచంద్రన్ పాత్రను అరవింద్ స్వామి పోషిస్తున్నారు. ఏప్రిల్ 23వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.