అదనపు కలెక్టర్ కీమ్యానాయక్
తుర్కపల్లి, జూన్ 7: రైతులు పండించిన ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వం కొ నుగోలు చేస్తుందని అదనపు కలెక్టర్ కీమ్యానాయక్ అన్నారు. సోమవారం మండల కేం ద్రంతో పాటు మాదాపురంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ధర్మారం, మోతీరాం తండాలలో నర్సరీలతో పాటు పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలతో ధాన్యం తడవకుండా ప్రభుత్వ పాఠశాలల్లో ధాన్యాన్ని నిల్వచేయాలన్నారు. త్వరలో నే కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం మొత్తాన్ని తరలించేందుకు చర్యలు చేపడుతామన్నారు. అదేవిధంగా నర్సరీలలో నిర్వాహకులు ఎప్పటికప్పు డూ కలుపు మొక్కలను తొలగించి మొక్కల సంరక్షణకు చర్యలు చేపట్టాల న్నారు. కార్యక్రమంలో ఎంపీపీ భూక్యా సుశీల, తహసీల్దార్ జ్యోతి, ఎంపీ డీవో ఉమాదేవి, ఎంపీవో శ్రీమాలిని తదితరులు ఉన్నారు.