జనగామ: అకాల వర్షాలు రైతుల పంటలను ఆగం చేస్తున్నాయి. జనగామ జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున భారీ వాన కురిసింది. దీంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని వ్యవసాయ మార్కెట్కు తీసుకువచ్చిన ధాన్యం తడి ముద్దయ్యింది. రాశుల పోసిన ధాన్యం, బస్తాలు పెద్ద ఎత్తున తడిసిపోయాయి. దీంతో రైతులు ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి