ఖాతా తెరువక ముందే జడేజా ఇచ్చిన క్యాచ్ వదిలేసిన బెంగళూరు భారీ మూల్యం చెల్లించుకుంది. చివరి ఓవర్కు ముందు 21 బంతుల్లో 26 పరుగులతో ఉన్న జడ్డూ.. మ్యాచ్ ముగిసే సరికి 28 బంతుల్లో 62 పరుగులతో నిలిచాడు. పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ వేసిన ఆఖరి ఓవర్లో 6,6,6+నోబ్,6,2,6,4తో విధ్వంసకాండ రచించిన ఈ ఆల్రౌండర్.. ఐపీఎల్లో ఒకే ఓవర్లో అత్యధిక పరుగులు (37) చేసిన ఆటగాడిగా గేల్ సరసన నిలిచాడు. బ్యాటింగ్లో బెంబేలెత్తించిన జడ్డూ.. బౌలింగ్లోనూ మూడు కీలక వికెట్లు పడగొట్టి బెంగళూరు జైత్రయాత్రకు బ్రేకులు వేశాడు. చెన్నైకు ఇది వరుసగా నాలుగో విజయం కాగా.. కోహ్లీ సేనకు నాలుగు వరుస విజయాల తర్వాత తొలి పరాజయం!
ముంబై: ఆల్రౌండర్ రవీంద్ర జడేజా (28 బంతుల్లో 62 నాటౌట్; 4 ఫోర్లు, 5 సిక్స్లు; 3/13) బ్యాట్తో, బంతితో మెరుపులు మెరిపించడంతో ఐపీఎల్ 14వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా నాలుగో విజయం సాధించింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్లో చెన్నై 69 పరుగుల తేడాతో బెంగళూరును చిత్తుచేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూ సుకెళ్లింది. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ జడేజా సూపర్ హిట్టింగ్కు తోడు డుప్లెసిస్ (50) రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్లకు 191 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో బెంగళూరు 9 వికెట్లు కోల్పోయి 122 పరుగులకు పరిమితమైంది. పడిక్కల్ (34) టాప్స్కోరర్.
ఓపెనర్లు డుప్లెసిస్, గైక్వాడ్ (33) దూకుడుగా ఆడడంతో పవర్ప్లే ముగిసే సరికి చెన్నై 51 పరుగులు చేసింది. 74 పరుగుల భాగస్వామ్యం తర్వాత 10వ ఓవర్లో గైక్వాడ్ ఔటైనా రైనా (24)తో కలిసి డుప్లెసిస్ ఇన్నింగ్స్ను నిలబెట్టాడు. 14వ ఓవర్లో హర్షల్ వరుస బంతుల్లో ఇద్దరినీ ఔట్ చేయగా.. కాసేపు దూకుడుగా ఆడిన రాయుడు (14) 18వ ఓవర్లో వెనుదిరిగాడు. అయితే 15వ ఓవర్లో జడేజా ఇచ్చిన క్యాచ్ను క్రిస్టియన్ వదిలేయడం ఆర్సీబీకి భారీ నష్టాన్ని కలిగించింది. హర్షల్ వేసిన చివరి ఓవర్లో తొలి రెండు బంతులకు రెండు సిక్సర్లు బాదిన జడ్డూ.. ఆ తర్వాత నో ఫ్రీహిట్ను సైతం వినియోగించుకొని మరో రెండు సిక్సర్లు అరుసుకున్నాడు. అలాగే ఐదో బంతికి సిక్సర్.. చివరి బంతికి బౌండ్రీతో ఆఖరి ఓవర్లో ఏకంగా 37 పరుగులు పిండుకున్నాడు.
భారీ లక్ష్యఛేదనలో బెంగళూరు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. దేవ్దత్ పడిక్కల్ (34) కాసేపు నిలిచినా కోహ్లీ (7) విఫలమయ్యాడు. సుందర్ (7), డేంజ ర్ మ్యాన్ మాక్స్వెల్ (22), మిస్టర్ 360 డివిలియర్స్ (4)ను జడేజా పెవిలియన్కు పంపడంతో బెంగళూరు కోలుకోలేకపోయింది. క్రిస్టియన్ (1), జెమీసన్ (16), హర్షల్ (0), సైనీ (2) పెవిలియన్కు క్యూ కట్టారు. చివర్లో చాహల్, సిరాజ్ (12) ఆలౌట్ ప్రమాదం నుంచి జట్టును బయటపడేశారు.
చెన్నై: రుతురాజ్ (సి) జెమీసన్ (బి) చాహల్ 33, డుప్లెసిస్ (సి) క్రిస్టియన్ (బి) హర్షల్ 50, రైనా (సి) పడిక్కల్ (బి) హర్షల్ 24, రాయుడు (సి) జెమీసన్ (సి) హర్షల్ 14, జడేజా (నాటౌట్) 62, ధోనీ (నాటౌట్) 2: ఎక్స్ట్రాలు: 6, మొత్తం: 191/4. వికెట్ల పతనం: 1-74, 2-111, 3-111, 4-142, బౌలింగ్: సిరాజ్ 4-0-32-0, జెమీసన్ 3-0-31-0, చాహల్ 3-0-24-1, సైనీ 2-0-27-0, హర్షల్ 4-0-51-3, క్రిస్టియన్ 2-0-12-0, సుందర్ 2-0-13-0.
బెంగళూరు: కోహ్లీ (సి) ధోనీ (బి) కరన్ 8, పడిక్కల్ (సి) రైనా (బి) శార్దూల్ 34, సుందర్ (సి) గైక్వాడ్ (బి) జడేజా 7, మ్యాక్స్వెల్ (బౌల్డ్) జడేజా 22, డివిలియర్స్ (బి) జడేజా 4, క్రిస్టియన్ (రనౌట్/జడేజా) 1, జెమీసన్ (రనౌట్/తాహిర్) 16, హర్షల్ (బి) తాహిర్ 0, సైనీ (సి) రైనా (బి) 2, చాహల్ (నాటౌట్) 8, సిరాజ్ (నాటౌట్) 12. ఎక్స్ట్రాలు: 8, మొత్తం: 20 ఓవర్లలో 122/9. వికెట్ల పతనం: 1-44, 2-54, 3-65, 4-79, 5-81, 6-83, 7-89, 8-94, 9-103, బౌలింగ్: దీపక్ చాహర్ 2-0-25-0, కరన్ 4-0-35-1, శార్దూల్ 4-0-11-1, జడేజా 4-1-13-3, తాహిర్ 4-0-16-2, బ్రావో 2-0-19-0.