న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి విజృంభణ కారణంగా దేశవ్యాప్తంగా కొన్ని సడలింపులతో లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. అయితే ఇటీవల కరోనా కేసుల సంఖ్య తగ్గుతుండటంతో లాక్డౌన్ ఆంక్షల నుంచి దశల వారీగా సడలింపులు పెంచుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రెటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలు రాశారు. ఆ లేఖలో కరోనా నిబంధనలకు సంబంధించి పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితులను బట్టి సడలింపులు ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించారు. అదేవిధంగా టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్ నియమాలను పాటించాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టమ్ను విచ్ఛిన్నం చేయడం కీలకమని కూడా లేఖలో తెలిపారు. రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని, పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలను పునఃప్రారంభించాలని పేర్కొన్నారు.