తలైవా రాజకీయాల్లోకి రావాలి.. చెన్నైలో అభిమానుల భారీ ప్రదర్శన

చెన్నై: తమిళ సూపర్స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ చెన్నైలో ఆయన అభిమానులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనారోగ్యం కారణంగా రాజకీయాల్లోకి రాకూడదని నిర్ణయించుకున్నానంటూ ఇటీవల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవాలని వారు కోరారు. చెన్నైలోని వళ్లువార్ కొట్టమ్లో జరిగిన ఈ ప్రదర్శనలో వందలాది మంది రజినీకాంత్ అభిమానులు పాల్గొన్నారు. మరికొన్ని నెలల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో రజినీకాంత్ గత డిసెంబర్లో సంచలన ప్రకటన చేశారు. త్వరలో రాజకీయ రంగప్రవేశం చేయబోతున్నట్లు వెల్లడించారు.
అయితే ఆ తర్వాత కొద్ది రోజులకే ఆయన స్వల్ప అనాగ్యానికి గురై కోలుకున్నారు. కానీ, అనారోగ్యం కారణంగా రాజకీయ రంగప్రవేశం చేయాలన్న తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన అభిమానులు భారీ ప్రదర్శన చేపట్టి రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలన్న తమ ఆకాంక్షను వెల్లడించారు.
Tamil Nadu: Members of Rajinikanth's fan club stage demonstration at Valluvar Kottam in Chennai to request the actor to take back his decision not to enter politics. pic.twitter.com/sMfXGpNOkt
— ANI (@ANI) January 10, 2021
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- అవును.. ఇండియన్ ప్లేయర్స్పై జాత్యహంకార వ్యాఖ్యలు నిజమే
- ఆస్కార్ రేసులో సూరారై పొట్రు
- 300 మంది పోలీసులకు గాయాలు.. 22 కేసులు నమోదు
- అభివృద్ధిని జీర్ణించుకోలేకే అవినీతి ఆరోపణలు
- ఎర్రకోటను సందర్శించిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి
- మస్క్ vs బెజోస్.. అంతరిక్షం కోసం ప్రపంచ కుబేరుల కొట్లాట
- శంషాబాద్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
- కుల్గామ్లో ఉగ్రదాడి.. ముగ్గురు జవాన్లకు గాయాలు
- జైలు నుంచి శశికళ విడుదల
- ఎర్రకోట ఘటన వెనుక కాంగ్రెస్, ఖలీస్తానీలు : కర్ణాటక మంత్రి