అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ (ఎస్వీవీయూ) ఖాళీగా ఉన్న వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ జిల్లాల్లో ఖాళీగా ఉన్న ల్యాబ్ టెక్నీషియన్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎంపికైనవారిని కాంట్రాక్ట్ పద్ధతిలో నియమిస్తారు. ఆన్లైన్ అప్లికేషన్లు వచ్చే నెల 3 వరకు అందుబాటులో ఉంటాయి.
మొత్తం పోస్టులు: 15
అర్హత: మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా (డీఎంఎల్టీ) ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా అభ్యర్థులు 18-42 ఏండ్ల మధ్య వయస్సు కలిగినవారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ. 200
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 03
వెబ్సైట్: https://svvu.edu.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి