ల్యాండ్ మాఫియాపై చర్యలు తీసుకోండి: మెహబూబా ముఫ్తీ

శ్రీనగర్ : జమ్ముకశ్మీర్లో ల్యాండ్ మాఫియా ఆగడాలు నానాటికి మితిమీరిపోతున్నాయని జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ విచారం వ్యక్తం చేశారు. ల్యాండ్ మాఫియా చెలరేగిపోతున్నా అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారే కానీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఫలితంగా అక్కడి మైనార్టీలు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. శనివారం ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మీడియాకు తెలిపారు.
జమ్ముకశ్మీర్ అధికారులు కేంద్ర ప్రభుత్వానికి వంత పాడుతూ వారు చెప్పినట్లుగా చేస్తున్నారని మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. ప్రజలను విడదీసి అధికారులే రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. జమ్ముకశ్మీర్లో ల్యాండ్ మాఫియా పెట్రేగిపోతున్నా పట్టించుకోవడం లేదని, వీరి కారణంగా ముస్లిం మైనార్టీలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నదన్నారు. ల్యాండ్ మాఫియాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోగా.. మైనార్టీలకు పనిష్మెంట్ ఇవ్వడం వింతగా ఉన్నదని తెలిపారు. జమ్ములోని ముస్లిం ఆధిపత్యం అధికంగా ఉన్న ప్రాంతంలో ల్యాండ్ మాఫియా వేళ్లూనికునిపోతూ ఇబ్బందులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అధికారులు కూడా ల్యాండ్ మాఫియాకే వంత పాడటం వల్ల మైనార్టీలు నష్టపోతున్నారని, ఇకనైనా ల్యాండ్ మాఫియాలను అదుపులో పెట్టాలని మెహబూబా ముఫ్తీ డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి..
ఇది అత్యత్తమ పోలీస్ శిక్షణ కళాశాల
మరణించిన రైతుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు
చరిత్రలో ఈరోజు.. సాయుధ పోరాటంతోనే స్వరాజ్యం సిద్ధిస్తుందని నమ్మారు
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- లైంగిక దాడిపై తప్పుడు ఆరోపణలు : రెండు దశాబ్ధాలు జైల్లో మగ్గిన తర్వాత!
- గ్రీన్ ఇండియా చాలెంజ్లో మొక్కలు నాటిన హోంమంత్రి
- హిందీలో రీమేక్ అవుతున్న ఆర్ఎక్స్ 100.. ఫస్ట్ లుక్ విడుదల
- సర్కారు వైద్యంపై ప్రజల్లో విశ్వాసం కలిగించాం : మంత్రి ఈటల
- వైరల్ వీడియో : పాట పాడుతున్న పులి
- అంతరిక్షంలో హోటల్.. 2027లో ప్రారంభం
- బెంగాల్ పోరు : లెఫ్ట్, ఐఎస్ఎఫ్తో కూటమిని సమర్ధించిన కాంగ్రెస్
- కరోనా ప్రభావం ఇప్పట్లో తగ్గదు: ప్రపంచ ఆరోగ్యసంస్థ
- కిడ్నాప్ అయిన 317 మంది బాలికలు రిలీజ్
- పవన్ నాలుగో భార్యగా ఉంటాను : జూనియర్ సమంత