శ్రీనగర్: జమ్ముకశ్మీర్లోని షోపియాన్లో ఉగ్రవాదులు, భద్రతాదళాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఎన్కౌంటర్లో ముగ్గురు టెర్రరిస్టులు హతమయ్యారు. షోపియాన్ జిల్లాలోని మునిహల్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చేపట్టాయి. ఈ సందర్భంగా భద్రతా దళాలపై ముష్కరులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు. వారిలో ఇద్దరు లష్కరే తాయిబాకు సంబంధించినవారిగా గుర్తించారు. మరో ఉగ్రవాది ఏ సంస్థకు చెందినవాడనే విషయం ఇంకా తెలియరాలేదని కశ్మీర్ జోన్ పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్కౌంటర్కు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.