జమ్ముకశ్మీర్లో తొలి మహిళా బస్సు డ్రైవర్.. పూజా దేవి

జమ్ము: జమ్ముకశ్మీర్లో తొలిసారి ఒక మహిళ ప్రయాణికుల బస్సును నడిపారు. కథువా జిల్లాకు చెందిన పూజా దేవి ఈ ఘనత సాధించారు. గురువారం జమ్ము నుంచి కథువా మార్గంలో తొలిసారి ప్రయాణికుల బస్సును డ్రైవ్ చేశారు. బస్సు డ్రైవర్ కావాలన్నది తన కోరిక అని ఈ సందర్భంగా మీడియాతో చెప్పారు. దీని కోసం తాను ఎంతో కష్టపడినట్లు తెలిపారు. మామ రాజేంద్ర సింగ్ నుంచి లారీ నడపడం నేర్చుకున్నట్లు వివరించారు. పేదరికం వల్ల చదువుకొనసాగించలేకపోవడం పట్ల బాధను వ్యక్తం చేశారు.
ముగ్గురు పిల్లలకు తల్లి అయిన పూజా దేవి మధ్యవయసులో తన కలను నెరవేర్చుకున్నారు. కుమారుడిని వెంటపెట్టుకుని గురువారం తొలిసారి జమ్ము నుంచి కథువా వరకు ప్రయాణికుల బస్సును నడిపారు. మరోవైపు మగవారితో సమానంగా ప్రయాణికుల బస్సు డ్రైవర్ వృత్తిని పూజా దేవిని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్తోపాటు పలువురు నేతలు, స్థానికులు, తోటి డ్రైవర్లు అభినందించారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండిProud to have from district #Kathua, #JammuAndKashmir, the first women bus driver Pooja Devi. pic.twitter.com/7wTMa272kC
— Dr Jitendra Singh (@DrJitendraSingh) December 25, 2020
తాజావార్తలు
- ఎగిరే బల్లి..పొలంలో అలజడి
- ట్రంప్ కొత్త పార్టీ పెట్టడం లేదు..
- ఈ 'కుక్క' మాకూ కావాలి
- చైనాలో ఇంటర్నెట్ స్టార్ గా మారిన 4ఏళ్ల చిన్నారి, స్పేస్ సూట్ లో పీపీఈ కిట్
- కరోనా టీకా తీసుకున్న ఎమ్మెల్యే సంజయ్
- మురికివాడలో మెరిసిన ముత్యం..సెలబ్రిటీలను ఫిదా చేసిన మలీషా
- అమెరికాలో కాల్పులు.. గర్భిణి సహా ఐదుగురు మృతి
- వ్యవసాయ చట్టాలతో రైతులపై ప్రధాని దాడి: రాహుల్గాంధీ
- వనపర్తి జిల్లాలో గుప్త నిధులు?
- రకుల్ కోవిడ్ రికవరీ జర్నీ- వీడియో