న్యూఢిల్లీ, జూలై 19: కరోనా మూడోవేవ్ ముప్పు ఉందన్న ఆందోళన నేపథ్యంలో 30 రోజులకు సరిపడా నిల్వలు ఉండేలా అత్యవసర మందులను కేంద్రం కొనుగోలు చేస్తున్నది. మొదటి, రెండో వేవ్లలో భారీగా కరోనా కేసులు నమోదవడంతో దేశంలోని చాలా దవాఖానల్లో అత్యవసర మందులకు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో కేంద్రం రెమ్డెసివిర్, ఫావిపిరావిర్తో పాటు పారాసిటమాల్, యాంటీబయాటిక్స్, విటమిన్ మాత్రలను కొంటున్నది. ఈ ఔషధాల తయారీదారులకు కేంద్రం అడ్వాన్స్గా సొమ్ము చెల్లించిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 50 లక్షల రెమ్డెసివిర్ వయల్స్ను కొనాలన్నది కేంద్రం ప్రణాళిక అని పేర్కొన్నాయి.