చండీగఢ్: పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ రాజీనామా చేసినట్లుగా మీడియాలో వచ్చిన వార్తలను ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖండించింది. సీఎం అమరీందర్ సింగ్ తన పదవిని వీడలేదని, ఆయన రాజీనామా చేయలేదని ముఖ్యమంత్రి మీడియా సలహాదారుడు రవీన్ తుక్రాల్ గురువారం తెలిపారు. 2017లో మాదిరిగానే 2022 అసెంబ్లీ ఎన్నికలలో కూడా పంజాబ్ కాంగ్రెస్ను విజయంవైపు ఆయన నడిపిస్తారని చెప్పారు. కాగా, అమరీందర్, నవజోత్ సింగ్ సిద్ధూ మధ్య కాంగ్రెస్ అధిష్ఠానం సయోధ్య కుదిర్చినట్లు తెలుస్తున్నది. అమరీందర్ను సీఎంగా కొనసాగించాలని, ఆయన నేతృత్వంలోనే వచ్చే ఏడాది ఎన్నికలకు వెళ్లాలని, సిద్ధూను పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమించాలని పార్టీ నిర్ణయించినట్లు సమాచారం.