ఎక్సైజ్ శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్
పాలమూరులో అభివృద్ధి పనులు పరిశీలన
మహబూబ్నగర్టౌన్, ఏప్రిల్ 19: అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలని ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం క్లాక్టవర్ చౌరస్తాలో విస్తరణ పనులను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుందరపట్టణంగా మహబూబ్నగర్ను తీర్చిదిద్దుతామని, ఇప్పటికే చౌరస్తాల ఆధునికీకరణ పనులు వేగవంతంగా చేపడుతున్నామన్నారు. రోడ్డు విస్తరణతో ట్రాఫిక్ సమస్య తీరడంతోపాటు కొత్త కళ వస్తుందని తెలిపారు. మినీట్యాంక్ బాండ్ చుట్టూ అభివృద్ధి చేస్తామని, శిల్పారామం పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, వైస్ చైర్మన్ తాటిగణేశ్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్కుమార్, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కార్యకర్త పాడే మోసిన మంత్రి
హన్వాడ, ఏప్రిల్ 19: మరణించిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మండలంలోని రామన్నపల్లి గ్రామానికి చెందిన రామయ్య, వేపూర్ గ్రామానికి చెందిన మల్లప్ప అనారోగ్యంతో మరణించడంతో సోమవారం వారి పార్థివదేహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని రామయ్య పాడెను మంత్రి శ్రీనివాస్గౌడ్ మోశారు. వారి కుటుంబాలకు రైతు బీమాతోపాటు ప్రభుత్వం నుంచి ఆర్థికసాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పిల్లలు ఉంటే గురుకుల పాఠశాలల్లో చేర్పించాలని పార్టీ నాయకులను ఆదేశించారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ వెంట ఎంపీపీ బాల్రాజ్, పార్టీ మండలాధ్యక్షుడు కరుణాకర్గౌడ్, మాజీ మండలాధ్యక్షుడు లక్ష్మయ్య, సర్పంచులు రాములమ్మ, గోవిందమ్మ, నాయకులు జంబులయ్య, నరేందర్, అనంద్, కృష్ణార్జున్, ఖాజాగౌడ్, యాదయ్య, అచ్చన్న తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
ఢిల్లీలో ఒకవైపు కరోనా.. మరో వైపు డెంగ్యూ..
ప్రాపర్టీ పేరుతో రూ 1.2 కోట్లకు టోకరా