న్యూఢిల్లీ, జూలై 10 : ఎంబీబీఎస్ విద్యార్థులు ఇకపై భారతీయ వైద్య విధానాల్లో (అయుష్) కూడా శిక్షణ పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు ఒక ముసాయిదాను జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది. ఆయుర్వేదం, యోగా, యునాని, సిద్ధ, హోమియోపతి, సోవా రిగ్పాలలో ఏదో ఒక విధానాన్ని ఎంబీబీఎస్ విద్యార్థులు ఎంచుకోవచ్చు. వీటిలో ఒక వారం శిక్షణ తప్పనిసరిగా పొందవలసి ఉంటుందని ముసాయిదాలో ఎన్ఎంసీ ప్రతిపాదించింది. ఎంబీబీఎస్ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత 12 వారాల వ్యవధిలో మొత్తం 17 పోస్టింగులను పూర్తిచేయవలసి ఉంటుంది. ఇందులో 14 తప్పనిసరి కాగా మిగతా మూడు ఐచ్ఛికంగా ఉన్నాయి. వాటిలో ఆయుష్ కూడా ఉన్నది. ఇప్పుడు దాన్ని తప్పనిసరి చేయనున్నారు.