సంగారెడ్డి, జూలై 6(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలను నమ్మితే ప్రజలు మోసపోవటం ఖాయమని.. ఈ రెండు పార్టీలు ప్రజలకు చేస్తున్నదేమీ లేదని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైనా రైతుబంధు, కల్యాణలక్ష్మి పథకాలు అమలవుతున్నాయా?, పొరుగునే ఉన్న కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం తెలంగాణలోని సంక్షేమ పథకాలను అమలు చేస్తుందా..?, ఉంటే ఆ పార్టీ నాయకులు చూపించాలని సవాల్ చేశారు. సీఎం కేసీఆర్ ఒక్కరే ప్రజల కోసం ఆలోచిస్తూ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని స్పష్టంచేశారు. మంగళవారం మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్రెడ్డి, ఎంపీ బీబీపాటిల్, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్తో కలిసి సంగారెడ్డి జిల్లాలో హరీశ్రావు పర్యటించారు. ఈ సందర్భంగా జహీరాబాద్లో మంత్రి మాట్లాడుతూ.. గాంధీభవన్, బీజేపీ కార్యాలయాల్లో మైకుల ముందు ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్న నేతలు.. ప్రజల కోసం ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పదేండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్.. ప్రజల గురించి ఏనాడు పట్టించుకోలేదని ఆరోపించారు.