మావోల చెరలో ఉన్న జవాన్ రాకేష్ సింగ్ విడుదలైనట్లు తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం ఆయన్ను మావోయిస్టులు తెర్రం అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ నెల 3న ఛత్తీస్ ఘడ్ లో జరిగిన మావోయిస్టుల దాడి అనంతరం కొందరు జవాన్లు కనిపించకుండా పోయారు. వారిలో రాకేష్ సింగ్ని బందీగా తీసుకెళ్లినట్లు మావోయిస్టులు జర్నలిస్టుల ద్వారా సమాచారం అందించారు. అంతేకాదు అతన్ని విడుదల చేయడానికి కొన్ని షరుతులు కూడా పెట్టారు.
మరోవైపు రాకేష్ సింగ్ ని విడుదల చేయాలని ఆయన కుటుంబసభ్యులు, గ్రామస్తులు మావోలకు విజ్ఞప్తులు చేశారు. ఈ క్రమంలో రాకేష్ సింగ్ మావోలు చెరనుంచి విడుదలయ్యారన్న వార్తలు వినిపిస్తున్నాయి.