ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘజియాబాద్లోని కావినగర్ పారిశ్రామిక పార్కులో ఉన్న ఓ కర్టన్ల తయారీ పరిశ్రమలో బుధవారం ఉదయం మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఫ్యాక్టరీ మొత్తం విస్తరించాయి. అనంతరం సమీపంలోని కంపెలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మొత్తం పది ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి కారణాలు ఇంకా తెలియరాలేదు. కాగా, కర్టన్ల కంపెనీలో అగ్నిప్రమాదం జరగడంతో.. ఆ ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి