ముంబై: వినూత్నంగా పెండ్లి వేదికకు చేరుకోవాలని భావించిన ఆ వధువు చిక్కుల్లో పడింది. మాస్క్ లేకుండా కారు బోనెట్పై కూర్చొని ప్రయాణించిన ఆమెతోపాటు బంధువులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మహారాష్ట్రలోని పూణేలో మంగళవారం ఈ ఘటన జరిగింది. 23 ఏండ్ల పెండ్లి కుమార్తె ఎస్యూవీ బోనెట్పై కూర్చొని డైవ్ ఘాట్ మీదుగా సాస్వాద్లోని పెండ్లి వేదికకు వెళ్లింది. ఆ వాహనం ముందు బైక్పై ఉన్న వీడియోగ్రాఫర్ తీసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
మరోవైపు వధువుతోపాటు ఆ వాహనంలో ప్రయాణించిన బంధువులు కూడా మాస్కులు ధరించలేదు. ఈ నేపథ్యంలో పూణే పోలీసులు వధువు, బంధువులు, వాహనం డ్రైవర్, వీడియోగ్రాఫర్పై మోటార్ వాహన చట్టం, విపత్తు నిర్వాహణ చట్టంతోపాటు కరోనా నిబంధనల ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.