హైదరాబాద్ ,మే 4:ఆన్లైన్ వెబ్ సర్వీస్ దిగ్గజాలు యాహూ, ఏవోఎల్ అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. గూగుల్, ఫేస్బుక్తో ఎంట్రీతో ఇవి ఆదరణ కోల్పోయాయి. ప్రస్తుతం యాహూ, ఐవోఎల్ అమెరికా టెలీ కమ్యూనికేషన్స్ దిగ్గజం వెరిజాన్ చేతిలో ఉన్నాయి. వీటిని విక్రయిస్తున్నట్లు అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ అనే ప్రయివేట్ ఈక్విటీ కంపెనీకి విక్రయిస్తున్నట్లు వెరిజాన్ ప్రకటించింది. ఈ డీల్ వ్యాల్యూ 500 కోట్ల డాలర్లు. ఇండియా కరెన్సీలో ఇది రూ.37,000 కోట్లు కాగా. ఈ త్రైమాసికంలో ఈ డీల్ పూర్తి కావొచ్చునని భావిస్తున్నారు.
యాహూ, ఏవోఎల్ను కొనుగోలు చేసిన విలువతో పోలిస్తే వెరిజాన్కు దక్కనుంది చాలా తక్కువ. 2015లో ఏవోఎల్ను 440 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసింది. ఆ తర్వాత మరో రెండేళ్లకు యాహూను 450 కోట్ల డాలర్లకు కొనుగోలు చేసి, రెండింటిని విలీనం చేసింది. సోమవారం నాటి ఒప్పందం ప్రకారం 500 కోట్ల డాలర్లలో 425 కోట్ల డాలర్ల నగదు, 75 కోట్ల డాలర్ల విలువ చేసే ప్రయోజనాలు, మైనార్టీ వాటా దక్కనున్నది. విక్రయించనున్న మీడియా వ్యాపారాలను అన్నింటిని ఒకే గొడుకు కిందకు చేర్చి కేవలం యాహూ పేరుగా మార్చనున్నట్లు తెలుస్తున్నది.