నల్లగొండరూరల్, ఏప్రిల్ 8 : రైతుల మేలు కోసమే ప్రభుత్వం ధాన్యం కొను గోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మండలంలోని తొరగల్ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ జగదీశ్వర్రెడ్డి, డీపీఎం రామలింగం, నాగేశ్వర్రావు, నిత్యానందం, తాసీల్దార్ నాగార్జున, ఏపీఎం సైదులు పాల్గొన్నారు.
నల్లగొండ మండలం జీ.చెన్నారం, కొత్తపల్లి, అనంతారం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో డీఆర్డీఓ శేఖర్రెడ్డి, పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఆర్జాలబావి, రసూల్పురం, ముషంపల్లిల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను డీసీఓ ఎస్.వీ.ప్రసాద్ ప్రారంభించారు. కార్యక్రమాల్లో పీఏసీఎస్ సీఈఓ అనంతరెడ్డి, డీపీఎం రామలింగయ్య, ఏపీఎం సైదులు, సిబ్బంది రామలింగయ్య, శ్రీను, నవీన్, ఉప్పునూతల వెంకన్న, జిల్లేపల్లి పరమేశ్ పాల్గొన్నారు.
తిప్పర్తి : మండల కేంద్రంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నల్లగొండ మార్కెట్ కమిటీ చైర్మన్ బొర్ర సుధాకర్ ప్రారంభించారు. కార్యక్రమంలో వైస్చైర్మన్ మధుసూదన్ రెడ్డి, డైరెక్టర్లు వనపర్తి నాగేశ్వర్రావు, బొల్లెద్దు వెంకన్న, మార్కెట్ సూపర్వైజర్ మధు, రైతులు తండు నర్సింహగౌడ్, ఇంద్రారెడ్డి, శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు.
ఏడున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం
కట్టంగూర్/ కేతేపల్లి : యాసంగిలో జిల్లా వ్యాప్తంగా ఏడున్నర లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నట్లు డీఆర్డీఓ శేఖర్రెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలం మునుకుంట్ల, అయిటిపాముల, కురుమర్తి, చెర్వుఅన్నారం, కేతేపల్లి మండలం ఇను పాముల గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. డీసీఎం మోహన్రెడ్డి, నకిరేకల్ సివిల్ సప్లయ్ డీటీ రాచకొండ జ్యోతి, ఏపీఎంలు చౌగోని వినోద, యాదమ్మ, సీసీ చౌగోని శంకర్ పాల్గొన్నారు.
కట్టంగూర్: మండలంలోని కల్మెర గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని డీసీఓ ఎస్.వీ.ప్రసాద్ ప్రారంభించారు.
మిర్యాలగూడలో 88 కేంద్రాలు
మిర్యాలగూడ రూరల్ : యాసంగిలో మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో 88 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అవంతీపురం మార్కెట్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. ఐదు మండలాల్లో 50 ఐకేపీ కేంద్రాలను, 37 పీఏసీఎస్ ఆధ్వర్యంలో, ఒకటి వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్లు సంజీవరెడ్డి,రామకృష్ణ, సీఈఓలు నర్సయ్య, యాదగిరి, మార్కెట్ కార్యదర్శి శ్రీధర్, సూపర్వైజర్లు గిరి ప్రసాద్, దైద సైదులు పాల్గొన్నారు.
వేములపల్లి: మండలంలోని శెట్టిపాలెం గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జడ్పీటీసీ ఇరుగు మంగమ్మ ప్రారంభించారు.
త్రిపురారం : మండలంలోని డొంకతండా గ్రామపంచాయతీలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఏపీఎం దిలీప్కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, బుజ్జి, మంగమ్మ, సీసీలు పిచ్చమ్మ, దేవ్సింగ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
ఇవీ కూడా చదవండి…
విస్తృతంగా కొవిడ్ వ్యాక్సినేషన్