అమరావతి : ఆంధ్రప్రదేశ్లో జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల నిర్వహణకు తనకు సమయం లేదని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ నెలాఖరుతో తన పదవీకాలం పూర్తమవుతుందని, ఎన్నికలు ఆ తర్వాత వచ్చే వారే నిర్వహిస్తారని తెలిపారు. హైకోర్టు ఆదేశాల మేరకు షెడ్యూల్ జారీ చేయలేని పరిస్థితిలో ఉన్నానన్నారు. నాలుగు వారాలు ఎన్నికల కోడ్ విధించాలన్న బాధ్యతనూ నెరవేర్చలేనని పేర్కొన్నారు. ప్రస్తుతం సిబ్బంది కరోనా టీకా వేయించుకోవడంలో నిమగ్నమయ్యారని ఎస్ఈసీ తెలిపారు. ఈ సమయంలో షెడ్యూల్ జారీ చేయలేనన్నారు. కొత్తగా వచ్చే ఎస్ఈసీపై ఎన్నికల బాధ్యలుంటాయన్నారు.