కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి
ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు
సవాతీలో వ్యాక్సినేషన్పై అవగాహన కార్యక్రమం
ఆసిఫాబాద్టౌన్,మే7(వాంకిడి) : అర్హులైన ప్రతి ఒక్కరూ కరోనా నివారణ టీకా వేసుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. వాంకిడి మండలంలోని సవాతీ గ్రామంలో గోండ్వానా పంచాయతీ సెంటర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉందని, ప్రతి ఒక్కరూ తప్పకుండా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కు లేకుండా బయటికి రావద్దని, చేతులను సబ్బు లేదా శానిటైజర్తో తరచూ శుభ్రం చేసుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని చెప్పారు. ఇంటింటా సర్వేకు వచ్చే అధికారులు,వైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. అనంతం సవాతీ, దాబా గ్రామాల నిర్మిస్తున్న వంతెన పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. నిర్మాణం వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో సిడాం దత్తు, తహసీల్దార్ మధుకర్, ఇన్చార్జి ఎంపీడీవో శివకుమార్, సర్పంచ్లు దేవ్ రావు, జయరామ్, కోఆర్డినేటర్ వసంత్ రావు, డాక్టర్ సతీశ్ ,తదితరులు పాల్గొన్నారు
నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్
ఆసిఫాబాద్ టౌన్, మే7 : నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరంలాంటిందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. జిల్లాకేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన లబ్ధిదారులకు చెక్కులను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెబ్బెన మండలం గంగాపూర్కి చెందిన దుర్గం హరికృష్ణకు రూ.10,500, ఆసిఫాబాద్ మండలం తుంపల్లికి చెందిన రజితకు రూ.10,500, వాంకిడి మండలం చిచ్చుపల్లికి చెందిన కమలాబాయికి రూ.34,500 మంజూరయ్యాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.