రాయ్పూర్ : కరోనా భయం మావోయిస్టులను వెంటాడుతోంది. ఛత్తీస్గఢ్ బస్తర్ రీజియన్లో కరోనా బారిన పడి 10 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ ధృవీకరించారు. తాజాగా కాంకేర్ జిల్లాలోని కామ్తేడా బీఎస్ఎఫ్ క్యాంపులో ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. కరోనా భయంతోనే వీరిద్దరూ ఆయుధాలతో లొంగిపోయినట్లు పోలీసులు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులో ఒకరు మహిళా మావోయిస్టు ఉన్నారు.
మరో 100 మందికి పైగా మావోయిస్టులు కరోనా బారిన పడినట్లు సమాచారం. కొవిడ్తో బాధపడుతున్న మావోలు జనజీవన స్రవంతిలోకి వచ్చినట్లయితే వారందరికీ ప్రభుత్వం తరపున మంచి వైద్యం అందిస్తామని దంతెవాడ ఎస్పీ అభిషేక్ పల్లవ హామీ ఇచ్చారు.