నర్సంపేట రూరల్, మే 21: అం దరూ మొక్కల సంరక్షణపై దృష్టి సారించాలని ఎంపీడీవో అజ్మీరా నాగేశ్వర్రా వు, ఏపీవో ఫాతిమామేరీ అన్నారు. శుక్రవారం మండలంలోని పర్శనాయక్తం డా నర్సరీని ఎంపీడీవో నాగేశ్వరరావు, మహేశ్వరం నర్సరీని ఏపీవో ఫాతిమామేరీ, రాములునాయక్తండా నర్సరీని సర్పంచ్ అజ్మీరా మాధవి పరిశీలించారు. ఆ యా గ్రామాల్లోని నర్సరీల్లో మొక్కల పెంపకాన్ని వారు పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శులు, వన సేవకులకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం ఎండలు తీవ్రంగా ఉన్నందున మొక్కలు ఎండిపోయే ప్రమాదముందన్నారు. వెంటనే ప్రతి నర్సరీపై షెడ్నెట్స్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. కలుపు మొక్కలను వెంట వెంటనే తొలగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు బానోత్ గాంధీ, మాడ్గుల కవిత, మాధవి, టీఏలు భద్రు, వెంకటేశ్వర్లు, ఉపేందర్, పంచాయతీ కార్యదర్శులు, వనసేవకులు పాల్గొన్నారు.