న్యూఢిల్లీ : కొవిడ్-19 సెకండ్ వేవ్ విరుచుకుపడటంతో తలెత్తిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు సైన్యం సాయాన్ని కోరూత ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. ఢిల్లీకి 590 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ కోటా కేటాయించగా ఆదివారం కేవలం 440 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందిందని మనీష్ సిసోడియా పేర్కొన్నారు.
ఆక్సిజన్ పడకల సంఖ్య పెంచుతుండటంతో తమకు రోజూ 976 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అవసరమని అన్నారు. మరోవైపు ఢిల్లీ సహా అన్ని రాష్ట్రాలకు వీలైనంత సాయం చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామని రక్షణ మంత్రి పేర్కొన్నారు. మరణాలను నిరోధించేందుకు ఆక్సిజన్ ట్యాంకర్లు ఢిల్లీ చేరుకునేలా అన్ని వనరులను వినియోగిస్తున్నామని చెప్పుకొచ్చారు.